Monday, April 29, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

- Advertisement -

బాహుబలి మూవీతో పాన్ ఇండియా దర్శకునిగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తాజాగా రూపొందిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకునిగా కీరవాణి అద్భుతమైన బాణీలను సమకూర్చారు.

తాజాగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ మూవీ గురించి, అలాగే తారక్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనేది నా ఫీలింగ్. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఓ ఫైట్‌ సన్నివేశం చూసి నా కన్నీళ్లు ఆగలేదని, అలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఇదే భావన కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.

Also read:ఈ హీరోయిన్లను పరిచయం చేసింది పూరీ జగన్నాదే?

అలాగే రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 సినిమాను చూసినప్పుడే సీనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఎదుగుతాడని అనిపించింది అంటూ చెప్పాడు.అంతేకాకుండా భజరంగీ భాయీజాన్ లాంటి పవర్ ఫుల్, ఎమోషనల్‌, సెంటిమెంటల్‌ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే చూడాలనుకుంటున్నట్లు ఈ మూవీ పై తన అభిప్రాయాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -