ఈ మద్య సోషల్ మీడియాలో సెన్సేషన్ వార్తలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళనాడు గవర్నర్గా ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును కేంద్రం నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీనిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.
దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తను తెగ వైరల్ చేస్తు పోస్టులు పెడుతున్నారు. 1990ల్లో బీజేపీలో చేరిన ఈ రెబల్ స్టార్.. 12, 13వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2002 వరకూ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.
2016లో రోశయ్య వెళ్లిపోయిన తర్వాత ఇప్పటి వరకూ తమిళనాడుకు గవర్నర్ నియమితం కాలేదు. అప్పటి నుంచీ మహారాష్ట్ర గవర్నర్ అయిన విద్యాసాగర్ రావే తమిళనాడుకు కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.