- Advertisement -
గురు సమానులు విశ్వనాథ్ గారు కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధ పడ్డాను. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని తెలిసి షాక్ అయ్యాను.
తండ్రిని కోల్పోయి బాధలో మునిగిపోయిన ఆ పిల్లలకు తల్లి కూడా దూరం అవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. కృష్ణంరాజు గారు ఆమెను మాతృ సమానురాలిగా గౌరవించేవారు. అలాంటి జయలక్ష్మీ మనలను వీడి వెళ్లి పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా.