Thursday, April 25, 2024
- Advertisement -

ఏం బలిసిందా.. బద్మాష్ సంజయ్‌?

- Advertisement -

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ పై ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని బండి సంజయ్ అవహేళన చేస్తూ మాట్లాడితే ఊరుకోమని అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తాట తీస్తామని హెచ్చరించారు.

బుధవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంబర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ ఠాక్రే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో, తెలంగాణ లో కూడా అలా స్పందించాలని తెరాస కార్యకర్తలను కోరారు. కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సందర్భం వస్తది.. సమయం వస్తది.. ఒళ్లు దగ్గరపెట్టుకో బండి సంజయ్.. తోలు తీస్తాం.. నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి మాటకు లెక్కగట్టి మొత్తం కక్కిస్తం బిడ్డా. ఏం బలిసిందా.. బండి సంజయ్..? బద్మాష్ సంజయ్.. ముఖ్యమంత్రిని పట్టుకొని అట్ల మాట్లాడతవా.. ఎన్ని గుండెలు నీకు. చేతగాని చవటలు.. పని చేయరానోళ్లు.. వీళ్లు మాట్లాడుతున్నారు కేసీఆర్ గురించి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ని ఉద్దేశించి బాల్కా సుమన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

వెన్న లాంటి పాటలు​ రాసిన​ వెన్నెలకంటి

సిడ్నీ టెస్టు: అతని చేతుల మీదుగా సైనీకి క్యాప్‌

అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను : సంపత్ రాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -