Friday, April 26, 2024
- Advertisement -

కొత్త ఇంట్లోకి చేరబోతున్న మహేష్ బాబు.. ?

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత, గీతగోవిందం మూవీ ఫేం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు ఇటీవలే తాజాగా వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం”ఎస్ఎస్ఎమ్‌బీ28″ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది
మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ కోసం అందమైన ఇంటి సెట్‌ను వేయించాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు త్రివిక్రమ్‌. ఇంటి డిజైన్, స్పేస్‌ వగైరా వంటి అంశాల గురించి ఈ చిత్ర ఆర్ట్‌ డైరెక్టర్‌తో త్రివిక్రమ్‌ చర్చిస్తున్నారట. ప్రస్తుత కరోన పరిస్థితి నుంచి బయట పడిన వెంటనే మహేష్ తో ఈ ఇంటి సెట్లో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.

Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ సరసన అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

Also read:మెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -