కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, టాప్ హీరో ధనుష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ధనుష్ కు రజినీకాంత్ కూతురితో పెళ్లి ఫిక్స్ అయినా తరువాత ధనుష్ తల్లితండ్రులమని ధనుష్ తన కుమారుడేనని, అతడిని తమకు అప్పగించాలంటూ ఒక వ్యక్తి గోల చేసిన సంగతి తెలిసిందే.
మళ్లీ ఇన్నేళ్లకు మదురై జిల్లా చెందిన ఆ.మలంపట్టి ప్రాంతానికి చెందిన కదిరేశన్, మీనాళ్ దంపతులు ధనుష్ తమ బిడ్డేనని పిటీషన్ దాఖలు చేసి మేలూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు దానిని విచారణకు స్వీకరించింది. జనవరి 12వ తేదీన ధనుష్ స్వయంగా న్యాయస్థానానికి హాజరుకావాలంటూ సమన్లు జారీచేసింది.
ఇక ఈ పిటిషన్ లో ధనుష్ అసలు పేరు కలై సెల్వన్ అని ఆ దంపతులు అంటున్నారు. చిన్నప్పుడు సరిగ్గా చదవకపోవడంతో.. మందలించినందుకు… కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు చెపుతున్నారు. వెళ్లే ముందు ఓ లేఖ కూడా రాసి వెళ్లాడని, తాను సినిమాలో చేరెందుకు వెళ్తున్నను అని.. తన గురించి వెతకద్దని ఆ లేఖలో రాశాడని వారు అంటున్నారు. ధనుష్ తమ కుమారుడేనని నిరూపించుకోవడానికి తాము డీఎన్ఎ పరీక్షలకు సైతం సిద్ధమేనని వారు స్పష్టం చేస్తున్నారు.
Related