దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత ఎన్టీఆర్-రామ్ చరణ్లతో భారీ మల్టీస్టారర్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇప్పటికే సినిమా కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. తాజాగా ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం నగర్లో ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు టచ్ కూడా ఉంటుందట. అయితే మహేశ్ బాబు ఈ సినిమాలో నటించడు.
మహేశ్ ఈ సినిమాకు తన వాయిస్ ఓవర్ ఇస్తాడని సమాచారం.మహేష్ తో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఒక వేళ అది నిజమే అయితే మహేష్ ఆ ప్రపోజల్ తిరస్కరించే అవకాశం తక్కువ.గతంలో మహేశ్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ మూవీలకు తన వాయిస్ ఓవర్ను ఇచ్చిన సంగతి తెలిసిందే.పైగా ఎన్టీఆర్కు,రామ్ చరణ్కు మహేశ్ బాబు క్లోజ్ ఫ్రెండ్.మరి వీరి సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉండగలడా?ఈ వార్తే కనుక నిజం అయితే ముగ్గురు హీరోల ఫ్యాన్స్కు పండుగే.