Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ ఆపండి.. మహేష్ తో సినిమా మొదలెట్టండి అంటూ రాజమౌళిపై ఒత్తిడి!

- Advertisement -

టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత, గీతగోవిందం మూవీ ఫేం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సాగుతుంది.ప్రిన్స్ సరసన బ్యూటీ క్వీన్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల ప్రభావం ఈ సినిమా షూటింగ్ పై కూడా పడింది.

“సర్కారు వారి పాట”సినిమా తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను ఫిక్స్ చేసాడు ప్రిన్స్ మహేష్.తాజాగా మూవీ పై ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల అవుతుందని సినిమా మేకర్స్ ప్రకటించారు. మళ్లీ వీరి కాంబినేషన్ 11 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

త్రివిక్రమ్ మూవీ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మహేష్ తో సినిమా చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుందని అభిమానులంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మరి.

Also read:ఆ లేడీ డైరెక్టర్ తో ప్రభాస్ నెక్స్ట్ చిత్రం.. కథ అదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -