ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్, సమంత, ప్రణతీ లు హీరోయిన్స్గా నటిస్తున్నారు. వచ్చే నెల రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.
ఇక మహేష్ ఈ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. వందకోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాలో మహేష్కు విలన్గా ఈ డైరేక్టర్ను సెలెక్ట్ చేశారు అని తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు ఇంతకు ముంది మహేష్ను డైరెక్ట్ చేసిన దర్శకుల్లో ఒకరట.
మహేష్ తో ‘టక్కరి దొంగ’ చిత్రాన్ని తీసిన దర్శకుడు జయింత్ సి పరాంన్జీ విలన్ గా తీసుకున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పరినీతి చోప్రా, కీర్తి సురేష్ లు నటించబోతున్నారని టాక్. కానీ ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ సినిమా లాంచిగ్ కానుంది.