డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ లోకి వచ్చిన మనోజ్, విష్లు, లక్ష్మీప్రసన్నలు నటించిన సినిమాలు ఈ ఏడాది ఎవరి ఊహించని విధంగా ప్లాప్ అయ్యాయి. వాస్తవానికి లక్ష్మీ నటించిన మూవీకి అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది. కానీ లక్ష్మీ నటించిన లక్ష్మీ బాంబ్ తుస్సు మంది. 2017లో విష్ణు నటించిన లక్కున్నోడు ముందుగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు.
విష్ణు కెరీర్లో పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఆ వెంటనే మంచు మనోజ్ నటించిన గుంటూరోడు రిలీజ్ అయ్యింది. మాస్లో కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న మంచు.. తొలిసారి మాస్ సినిమా చేశాడు. దాంతో వర్కవుట్ అయిపోతుందనుకొన్నారంతా.. కానీ గుంటూరోడు కూడా ప్లాప్ గానే నిలిచింది. ఈ మూవీ కోసం ఏకంగా రూ.11 కోట్లు ఖర్చు చేశారు. పెట్టిన ఖర్చుకు రెండో మూడో తిరిగొచ్చాయంతే. ఈ వారం మంచు లక్ష్మి సినిమా లక్ష్మీబాంబ్ వచ్చింది. దీపావళికి రావాల్సిన సినిమా.. ఇంత ఆలస్యంగా వచ్చింది. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా.. వచ్చిన ఈ బాంబ్.. తుస్సుమంది. థియేటర్లు లేక… ఉన్నా.. అందులో ఆడియన్స్ లేక బిక్కు బిక్కుమంది.
ఈ సినిమాకి రూపాయి పెట్టుబడి పెడితే.. రూపాయీ పోయినట్టే అని ట్రేడ్ వర్గాలు అప్పుడే లెక్క గట్టేశాయి. ఈ మాత్రం దానికి పబ్లిసిటీ ఎందుకని.. నిర్మాతలు కూడా సినిమాని మాములుగా రిలీజ్ చేశారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడు సినిమాలూ దారుణంగా పల్టీ కొట్టేశాయి. మనోజ్ బరువు తగ్గి మంచి కథలు ఉన్న సినిమా ఎంచుకుంటే హిట్ కొట్టే అవకాశం ఉంది. విష్ణు కూడా మంచి స్టోరీ ఉన్న సినిమాలు తీస్తే సినిమాలు హిట్ అవుతాయి. మంచు లక్ష్మి కూడా ఏ సినిమా పడితే ఆ సినిమాలు కాకుండా విషయం ఉన్న సినిమాలు తీస్తే బేస్ట్. లేదంటే.. ఈ ఫ్లాపుల పరంపర ఇక ముందూ కొనసాగే ప్రమాదం ఉంది. మరి డైలాగ్ కింగ్ వీరికి ఎలాంటి జ్ఞాన బోధ చేస్తాడో చూడాలి.
Related