టాలీవుడ్ లో హీరో మంచు మనోజ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు పెద్దగా హిట్ కాలేకపోయిన.. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బుధవారం మనోజ్ చేసిన ట్వీట్ పెద్ద సంచలనం అయింది. ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ మరియు నా నెక్ట్స్ మూవీ నటుడిగా నా చివరి సినిమా.. థాంక్యూ ఆల్ అని ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
నటుడిగా తన కెరీర్కు పులిస్టాప్ పెడుతున్నాను….. అని అర్థం వచ్చేలా ఉన్న ఆ ట్వీట్ మంచు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అయితే ఆ ట్వీట్ను గంట వ్యవధిలోనే మనోజ్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ న్యూస్ వైరల్ అయింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో.. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణ, మంచు లక్ష్మికి చేవిన పడటంతో.. వెంటనే మనోజ్ను పిలిపించి మరి క్లాస్ పీకారని, వారి బలవంతంతోనే ట్వీట్ డిలీట్ చేశారని సమాచారం. దర్శకత్వంపై ఇష్టంతో ఆ ట్విట్ చేసినట్లుగా ఇంట్లోవాళ్లకు మనోజ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నటుడిగా ఇదే నా చివరి సినిమా అంటూ పిచ్చి పిచ్చి ట్వీట్స్ పెట్టోద్దు అని మనోజ్ కి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడట.
{loadmodule mod_custom,GA2}
అయితే కొందరూ మాత్రం మనోజ్ తన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ పబ్లిసిటీ కోసం.. ఈ స్టంట్ అంటూవిమర్శిస్తున్నారు. అయితే మనోజ్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించి, ఆ ట్వీట్ చేశానని తెలిపారు. చాలా మంది తన పోస్ట్ను రకరకాలుగా అర్థం చేసుకున్నారని, కానీ అది ఇలా అవుతుందని అనుకోలేదని వివారణ ఇచ్చాడు.
{youtube}tUHj9C3w9nY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related