నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ మూవీ ఆడియో వేడుక ఇటివలే అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఆడియో వేడుకకు అక్కినేని నాగర్జున, నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సంపత్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్టిస్ట్ లను మేళాలు మోగిస్తూ వారికి స్వాగతం పలికారు. ఈ వేడుకలో నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులేశారు. ఆ తర్వాత రవి, గీతా భగత్ ఈ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక కు హోస్ట్ గా చేసారు. యాంకర్ రవి నాగార్జునను ఒక ప్రశ్న అడిగాడు..
{loadmodule mod_custom,Side Ad 1}
‘చైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్. మీరు ఏమంటారు?’ దానికి నాగార్జున ‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు’ అని నాగార్జున అనడంతో నవ్వులు విరిశాయి. ఇక ఈ సినిమాపై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాని నాగర్జున నిర్మించడం విశేషం. పక్క సినిమా మంచి హిట్ అవుతుందని ఈ సినిమా యూనిట్ అంటోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related