ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాల విడుదల విషయంలో మూడు నాలుగు నెలల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. చివరి టైంలో విడుదల తేదీ చెబితే థియేటర్లు దొరక్క ఇబ్బదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెపథ్యంలో ఓ మెగా హీరో నటిస్తున్న విడుదల తేదీని ఏకంగా మూడున్నర నెలల ముందుగానే ఎనౌన్స్ చేశారు. అది బానే ఉన్నా ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2కు ఎదురుగా వెళ్లడం మాత్రం అందరికి షాక్ ఇచ్చేలా ఉంది.
మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్, శ్రీనువైట్ల డైరెక్షన్ లో రూపొందుతున్న మిస్టర్ సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతల నుంచి ఓ క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం కానుకగా టీజర్ విడుదల అయిన ఈ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 14న అని ఓ టాక్ బయటకు వచ్చింది. బాహుబలి 2 ఏప్రిల్ 28న వస్తోంది. ఆ సినిమాకు రెండు వారాల ముందుగా మిస్టర్ను రిలీజ్ చేస్తారు. అంటే.. బాహుబలి 2కు రెండు వారాల ముందు అప్పటకీ మిస్టర్ ఆడే అన్ని థియేటర్లు ఖాళీ చేసి బాహుబలి 2కు ఇచ్చేయాలి. బాహుబలి వంటి సినిమాకి ముందు మిస్టర్ను రిలీజ్ చేయడం అంటే రిస్క్ అనే పదం వినిపిస్తోంది. పవన్ కాటమరాయుడు ఉగాది కానుకగా మార్చి చివర్లో వస్తోంది.
ఈ చిత్రం వచ్చిన రెండు వారాలకు మిస్టర్.. ఆ తర్వాత రెండు వారాలకు బాహుబలి 2 ఉంటుంది. ఇలా ఈ రెండు సినిమాలకు మధ్యలో మిస్టర్ వస్తే రిస్క్ కదా అన్న టాక్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి మిస్టర్ సేఫ్జోన్లోకి వచ్చేందుకు ఈ సమయం సరిపోతుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలకు మధ్యలో అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ కూడా ఉంది. మరి వరణ్ తేజ్ ఈ తేదీకే వచ్చి రిస్క్ ఎదుర్కొంటాడా ? లేదా ? ఇంకో డేట్ కోసం ఫిక్స్ చేసుకుంటాడా ? అన్నది చూడాలి.
Related