దేశంలో బ్లాక్ మనీని అడ్డుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో.. దేశవ్యాప్తంగా పెద్ద కార్యకలాపాల నుంచి సామాన్యుల వరకు ఎన్నో కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది. ఈ నోట్లు మారేవరకు సామాన్య జనాల ఇబ్బంది కలగనుంది. మోడీ షాక్ ఇవ్వడంతో అసలే కష్టాల్లో ఉన్న ఇద్దరు తెలుగు హీరోలు మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అసలు టాలీవుడ్ హీరోల కష్టాలకు.. మోడీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా… మోడీ పెద్ద నోట్లు రద్దు చేయడంతో టాలీవుడ్లో ఈ శుక్రవారం విడుదల అవుతున్న సినిమాల మీద ఈ ప్రభావం గట్టిగా కనిపించనుంది. ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లను ఎవరు తీసుకోవడం లేదు. ఇక వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మంది థియేటర్ల వరకు వెళ్తారు అన్నది ప్రశ్నగా మారింది. టాలీవుడ్ లో ఈ శుక్రవారం నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో, అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఈ ఇద్దరు వరస ప్లాపుల్లో వున్నారు. చైతు చాలా కాలం తర్వాత ప్రేమమ్తో హిట్ కొట్టినా… నరేష్ మాత్రం ప్లాపుల నుంచి బయట పడటం లేదు. చైతు సాహసంతో మరో హిట్ తన ఖాతలో వెసుకోవాలి అనుకుంటున్నాడు. నరేష్ ఈ సినిమాతో అయిన హిట్ కొట్టాలనుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సమస్య నుంచి నరేష్, చైతు ఎలా బయట పడతారో చూడాలి. అసలే జనాలు నోట్ల వలన సమస్యలో ఉన్నారు. ఈ సమస్య తీరేవరకు సినిమాలకు వచ్చే అవకాశం తక్కువే. మరి ఈ రెండో సినిమాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Related