పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మార్చ14న ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రోజు రోజుకి పెంచేస్తున్నాడు త్రివిక్రమ్.
ఇప్పుడు ఈ చిత్రంలో ఓ స్పెషల్ కేరక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోనున్నారనే వార్త సంచలనంగా మారింది. తెలుగులో ఈ మధ్య మోహన్ లాల్ మంచి ఇమేజ్ సంపాదించేసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా అంటే.. ఖచ్చితంగా స్పెషల్ గా ఉంటుంది. అందుకే ఈ స్పెషల్ కేరక్టర్ కు మోహన్ లాల్ ను అనుకోవడం.. దానికి మలయాళ సూపర్ స్టార్ సై అనడం కూడా జరిగిందట.
అయితే.. ఇంకా సైన్ చేయకపోయినా.. ఈ కేరక్టర్ మోహన్ లాల్ చేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ మూవీలో కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ లు హీరోయిన్స్ నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Related