Saturday, May 18, 2024
- Advertisement -

రిస్క్ చేయడానికి ఆ హీరోకి ధైర్యం లేదు!

- Advertisement -

నాగశౌర్య అంటే జాదుగాడు చిత్రం ముందు వరకూ…. మాంచి ఇమేజ్ .అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సర్కిల్లో మాత్రమే ఉండేది. కాని జాదుగాడు తర్వాత  అతని సీను ,సినిమా రెండు మారిపోయాయి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకున్న శౌర్య….కళ్యాణ వైభోగమే అంటూ మన ముందుకు వస్తున్నాడు.

నిజానికి ఫ్యామిలీ వెంచర్లు చేసుకుంటూ తనకు తెలిసిన రూట్లో తాను వెళ్లిపోయే సైలెంట్ హీరో…. మన నాగశౌర్య.ఈయనగారు ఫస్ట్ టైమ్ తన రూట్ మార్చి జాదుగాడుతో మాస్ ఆడియన్స్ కు చేరువవ్వాలని చూసాడు. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ ఏంటో మనకు తెలుసు కాబట్టి… శౌర్య ర్యాంక్ ఎలా పడిపోయిందో  చూసాం.

అందుకే కాబోలు తనకు ఇప్పటి వరకూ ప్రేక్షకులు ఇచ్చిన ఇమేజ్  ను కాదనుకుని…. వేరే రూట్లోకి వెల్లడం ఎందుకా అని నాగశౌర్య తనని తాను కొశ్చన్ చేసుకున్నాడు.అలా చేసుకోవడంతో ఇపుడు నందినీ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న కళ్యాణ వైభోగమే చిత్రం మొదలైంది.దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.  వన్ లైఫ్ వన్ సెలబ్రేషన్ అంటూ  ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. పోస్టర్ చూస్తే మనకు పెళ్లి హడావిడితో నిండిపోయినట్లు కనిపిస్తుంది.

 హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత బంధువులంతా కలిసి దిగిన సెల్ఫీనే ఫస్ట్ లుక్ గా ఇవ్వడం చూడడానికి అయితే భాగానే ఉంది. నాగశౌర్య మాళవికా నాయర్ లు కళ్యాణ వైభోగమేలో సందడి చేయనున్నారు. ఈ పోస్టర్ పై స్టార్ హీరోయిన్ సమంత పాజిటివ్ కామెంట్ కూడా చేసేసింది.దీంతో నాగశౌర్యకు మునుపటి ఉత్సాహం కొట్టొచ్చునట్టు కనిపిస్తుంది.

 నాగశౌర్య అనే హీరోకు ఎలాంటి బ్యాక్ గ్రౌండూ… లేదు.ఇతను ఎవరి వారసుడు కాదు.తనకు తోచిన రీతిలో అతను వెళ్ళిపోతున్నాడు.అలాంటి హీరోకు ఒకే ఒక్క చిత్రం జాదుగాడుతో పరిశ్రమలో దిక్కులు కనిపించకుండా పోవడంతో రిస్క్ చేయడం ఎందుకనే అభిప్రాయానికి వచ్చేశాడు.ప్రస్తుతం ప్రేక్షకులు తనని ఏ యాంగిల్లో చూడాలనుకుంటున్నారో అదే రీతిలో చూసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దైర్యం చేసి మళ్లీ రిస్క్ చేసి మాస్ జోనర్ చిత్రం చేసే ఆలోచనను పక్కన పెట్టేశాడు.

ఒక్క జాదుగాడు చిత్రం దిక్కులు చూడకు రామయ్యను ఎలా మార్చేసుందో నని పరిశ్రమలో నాగశౌర్య పై కామెంట్లు పడిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -