తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి “ఫిదా” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి రెమ్యునరేషన్ విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్న సందర్భంగా తాజాగా ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ లెక్కల ప్రకారం సాయి పల్లవి ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర రెమ్యునరేషన్ పొందుతోందని,2020 లో సాయి పల్లవి మూడు మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ రూపంలో తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న అనుష్క, సమంత, కాజల్ తర్వాత సాయి పల్లవి ఈ జాబితాలో నిలిచింది.
Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?
ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “లవ్ స్టోరీ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’ మూవీలోను తర్వాత రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా “శ్యామ్ సింగరాయ్” వంటి మూవీలో నటిస్తోంది.
Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?