Sunday, May 19, 2024
- Advertisement -

150వ సినిమాపై ముందు అది తేలాలి

- Advertisement -

తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ని తెలుగులో చిరంజీవి 150వ చిత్రంగా తీస్తున్నాడు. ఇందు కోసం రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు వి.వి.వినాయక్‌ చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి  స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‍గా నయనతార, అనుష్కలను సంప్రదించారని తెలుస్తోంది. అనుష్క బాహుబలి లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కష్టమని తెలుస్తుంది. దాంతో  నయనతార ఖరారు చేశారు అని తెలుస్తుంది. ఏప్రియల్ ముహూర్తం చేసి, రెగ్యులర్ షూటింగ్ జరుపుతారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

ఈ చిత్రాన్ని మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్‌ ఆరంభం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నరసింహరావు అనే కో డైరక్టర్ వేసిన కధా చౌర్యం కేసు సెటిల్ అయితే కానీ ప్రారంభించలేరు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించం క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా ఖరారు కాగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా అడిగినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -