ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. రెండు పార్టులుగా సినిమా తెరకెక్కుతుండగా పస్ట్ పార్ట్ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా ఈ సినిమాతో ప్రభాస్ హిట్ సొంతం చేసుకుంటాడా లేదా వేచిచూడాలి..
అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ హైబడ్జెట్ మూవీలో గెస్ట్ రోల్స్లో జూనియర్ ఎన్టీఆర్తో పాటు యష్ నటిస్తున్నారట. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వీరి ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. రీసెంట్గా రజనీ నటించిన జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్కుమార్ గెస్ట్ రోల్స్లో నటించగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక తాజాగా సలార్లోనూ అలాంటి ప్రయోగమే చేయనున్నారని టాక్.
ఇదే నిజమైతే సలార్ చిత్ర రేంజ్ ఊహించడమే కష్టం. ముగ్గురు పాన్ ఇండియా మాస్ హీరోలు నటించే భారీ చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.