Sunday, May 19, 2024
- Advertisement -

కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు..?

- Advertisement -

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా చేస్తున్నాడంటే.. ప్రత్యేకంగా బ్యానర్ ఏంటి అని అడగక్కర్లేదు. ఎందుకంటే.. అయన సినిమాలన్ని దాదాపు సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతాయి. అయితే వాటిలో డబ్బులు వచ్చిన వాటికంటే పోయిన సినిమాలే ఎక్కువ.

అయితే సినిమాల పరంగా కళ్యాణ్ రామ్ లాస్ అయ్యి ఉండవచ్చు కానీ ఆర్ధికంగా కళ్యాణ్ రామ్ బలంగా ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ కోసం జై లవ కుశ నిర్మిస్తున్నాడు. ఈ సినిమకి 40 కోట్లకు పైగా మిగిలే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాకి మహా అయితే 60 కోట్ల కన్నా ఖర్చు కాదు. బిజినెస్ ఎలాగో 100 కోట్లకు పైనే ఉంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ వరసగా రెండు సూపర్ హిట్స్ అందుకోవడంతో.. ఎన్టీఆర్ జైలవ కుశ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది ఇలావుంటే.. కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ రెండు సినిమాలు కూడా బయట బ్యానర్సే. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పోయింది జై లవ కుశ తో రికవర్ అవుతుంది.

మన బ్యానర్లో సినిమా చేస్తే.. మంచి సినిమా చేసి హిట్ కొట్టి.. మళ్లీ డబ్బులు పోగొట్టుకోవద్దు అని కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ సలహా ఇచ్చారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. సలహా అయితే మంచిదే ఎంతైనా అతను తన సొంత అన్న ఎన్టీఆర్ ఏమో ఇండస్ట్రీ లో టాప్ హీరో ఈ స్థాయికి ఎన్టీఆర్ వచ్చాడంటే ఎన్ని చూసుంటాడు, సో వయసు కంటే అనుభవం గొప్పది. ఎన్టీఆర్ చెప్పిన సలహాలు కళ్యాణ్ రామ్ పాటిస్తే.. అతనికే మంచిది కదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -