Saturday, April 27, 2024
- Advertisement -

కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించ్చనున్న ఎన్టీఆర్

- Advertisement -

కొత్త ప్రతిభావంతులైన దర్శకులు మరియు నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ హీరోలు కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నారు. చిన్న-మీడియం బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. చిన్న-మీడియం బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ సినిమాలను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి ఈ బ్యానర్‌లో థియేటర్లు మరియు OTT కోసం చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారట. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని కలిగి ఉన్నాడు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా యువి క్రియేషన్స్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించాడు. నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలలో ది ఇండియన్ హౌస్ అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. రామ్ చరణ్‌తో పాటు, మహేష్ బాబు మరియు నాని వంటి స్టార్ హీరోలు కూడా తమ సొంత ప్రొడక్షన్ హౌస్‌లను ప్రారంభించారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. దేవర 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -