టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరు టాప్ హీరోల పాత్రలకు సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.
జిల్ జిల్ జిగేలు రాణి అంటూ కుర్రాళ్లకు ఉర్రూతలూగించింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు.. పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ కి జోడీగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది.ప్రస్తుతం పూజాహెగ్డే, రామ్చరణ్లపై ఓ పాటని మారేడుమిల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరిస్తున్నారు.ఈ పాటకి శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూరుస్తున్నారు. మూడు రోజుల పాటు అటవీ నేపథ్యంగా చిత్రీకరించే ఈ పాట కథనంలో చాలా కీలకమైనదని సమాచారం. మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవ్వడం ఫ్యాన్స్ కి మంచి ఊపునిస్తుందట.
దిల్ రాజు షాక్.. ‘వి’ సినిమాను తొలగించిన అమెజాన్ !