Wednesday, May 1, 2024
- Advertisement -

యూట్యూబ్ లో సాయిపల్లవి మరో సంచలనం!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ, లవ్ తరహా చిత్రాలు అందించడంలో శేఖర్ ఖమ్ములకు తనకు తానే సాటి. హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సృష్టించాడు. ఆ మద్య ఫిదా చిత్రంతో అందరినీ ఫిదా చేశాడు. తాజాగా హీరో నాగ చైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిదా చిత్రంలో మధు ప్రియ ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అంటూపాడిన పాట యూట్యూబ్ సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.

”లవ్ స్టోరి” చిత్రంలో రెండు పాటలు ‘ఏయ్ పిల్లా’, ‘నీ చిత్రం’ చూసి ఇప్పటికే రిలీజ్ అయ్యి రికార్డ్ వ్యూస్ సాధించగా…తాజాగా మూడో పాట ‘సారంగ దరియా’ విడుదల చేశారు. ‘సారంగ దరియా’ కు ప్రసిద్ధ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ పువ్వుల్లాంటి పదాలతో దండలాంటి పాట రాయగా..ఆ పాటకు యువ సంగీత ప్రతిభాశాలి పవన్ సీహెచ్ తో మాంచి ఫోక్ బీట్ వేశారు. సూపర్ హిట్ కాంబినేషన్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి మరోసారి డాన్స్ లతో చూపు తిప్పుకోకుండా చేసేశారు.

అదిరిపోయే క్రియేటివ్ స్టెప్పులు సాయి పల్లవితో ‘సారంగ దరియా’ లో వేయించారు. ఈ పాటను ఫోక్ క్వీన్ మంగ్లీ ..ఫుల్ జోష్ లో పాడి ఖుషి చేసింది. వచ్చిండే..’, ‘రౌడీ బేబీ’ పాటలతో యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి తాజాగా ‘సారంగ దరియా’తో మరోసారి సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట వీడియో ఇప్పటికి 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.అలాగే 5 లక్షలకు పైగా లైక్‌లు దక్కించుకుంది.ఖచ్చితంగా ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పోలీసుల కొత్త ప్రయత్నం .. చూస్తే నవ్వుకోవడం పక్కా..!

ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు ట్రైలర్…!

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -