యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ మూవీ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా విజయవంతం కావడంతో అనిల్ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి చూపించాడు. ‘మహేష్ కోసం ఓ లైన్ తయారు చేశానని, అది ఆయనకు నచ్చడంతో కథను డెవలప్ చేయాలని చెప్పినట్లు ‘ ఇటీవల పలు ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తెలిపారు.
అయితే ఇప్పుడు అనిల్ కథ సిద్ధం చేసినా మహేష్ బాబు డేట్స్ ఇప్పట్లో దొరికే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అవగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో పాన్ ఇండియా కేటగిరిలో ఓ సినిమా రూపొందనుంది. పరశురామ్, త్రివిక్రమ్ సినిమాలు త్వరగానే పూర్తయినా రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉండడంతో అనిల్ రావిపూడి ఆలోచనలో పడినట్లు సమాచారం.
Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!
ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. మహేష్ కోసం సిద్ధం చేసిన కథను పవన్ కల్యాణ్ తో చేయాలని ఆయన అనిల్ ను కోరాడట. ఇందుకు ఓకే అంటే పవన్ కళ్యాణ్ ని కలిసి ఓకే చేయిస్తానని చెప్పాడట. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇవి సగభాగం పూర్తయ్యాయి. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పవన్ ఓకే చెప్పాడు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి పవన్ కాంబినేషన్ లో మూవీ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..