పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో చాలా తక్కువ మంది క్రోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో పవన్ కి బాగా దగ్గర ఫ్రెండ్ నిర్మాత శరత్ మరార్. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పవన్ సినిమాలు ప్లాప్ అయిన శరత్ మరార్ మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ గా ఉంటారు.
పవన్ కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల విబేధాలు తలెత్తాయని, దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజం అనేలా ఇటివలే జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో అలీ, త్రివిక్రమ్ లాంటి పవన్ కళ్యాణ్ సన్నిహితులంతా హాజరయ్యారు. నిర్మాత సురేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంకు హాజర్ అయ్యారు. కానీ ఆ వేడుకలో మాత్రం శరత్ మరార్ కనిపించలేదు. దీంతో పవన్, శరత్ మధ్య దూరం పెరిగిందని కొందరు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు చిత్రాలను శరత్ మరార్ నిర్మించారు.
ఇవి ప్లాప్ అయ్యాయి. దాంతో ఆయన అర్ధికంగా బానే నష్టపోయారట. ఈ కారణం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ పవన్, శరత్ మరర్ మధ్య స్నేహం బంధం బలమైందని, చిన్న చిన్న కారణాలకే వారు విడిపోరని వారిద్దరి గురించి బాగా తెలిసినవారు అంటున్నారు. అసలు నిజం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.