పెద్ద నోట్ల ప్రభావం సామాన్యుల మీద చాలా పడింది. అయితే ఇప్పుడు ఓ ప్రభావం సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. దాదాపు వారం రోజులుగా ఎక్కువమంది భారతీయుల కాలం బ్యాన్కుల్లోనే గడిచిపోతోంది.
సామాన్యులతో పాటు ఇప్పుడు సెలబ్రిటీలు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోని ఓ బ్యాంకుకు వచ్చి తన వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా బ్యాంకుకు వచ్చి తన వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. పవన్ కళ్యాణ్ బ్యాంకులో కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పవన్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయణ్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
అక్కడ మరింత గందరగోళం సృష్టించడం ఇష్టం లేక పవన్ తన పనిని త్వరగా ముగించుకుని వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్.
{youtube}UhapvCdWR1I{/youtube}
Related