Monday, May 13, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతోకి అడ్డోచ్చిన పవన్!?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేశారు. అవును ఇది నిజమే పవన్ కళ్యాణ్ హీరోగా  బీవీఎస్ఎస్ ప్రసాద్‌ ‘అత్తారింటికి దారేది’ అనే సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమాపై అప్పట్లో పైరసీ జరిగిన విషయం తెలిసిందే.

ఐతే నిర్మాతకి ఎలాంటి నష్టం రాకుండా పవన్ తన రెమ్యునరేషన్ తరువాత తీసుకుంటా అని చేప్పాడట. కానీ ‘అత్తారింటికి దారేది’ పైరసీ జరిగిన ఓ రెంజ్‍లో హిట్ అయ్యి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయిన ఇంతవరకు పవన్‍కి ఇవ్వావల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదట. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలోపు మొత్తం రెమ్యునరేషన్ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పాడట నిర్మాత.

దాంతో పవన్ చాలా రోజులు చూసి ఇక ఇవ్వాకపోవడంతో పవన్ ‘మా’ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.  పవన్ ఇచ్చిన ఫిర్యాదును ‘మా’ అసోసియేషన్ నిర్మాతల మండలికి పంపిందట. మరి ఈ ఫిర్యాదు పై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఏం స్పందిస్తారో అలాగే నిర్మాత మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -