Saturday, April 27, 2024
- Advertisement -

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

- Advertisement -

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి, ప‌వ‌స్టార్ పవన్ కళ్యాణ్ క‌లిసి సినిమా చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది టాలీవుడ్ సినీ వర్గాల్లో. అందుకోస‌మే పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిని ఆర్ఆర్ఆర్ సెట్‌ను వ‌చ్చాడ‌ని ప‌లువురు చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమెక్ ఇది. ఇప్పటికే అక్కడ వేసిన లాడ్జ్ సెట్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఆ షూటింగ్ పక్కనే ఆర్ఆర్ఆర్ సెట్ కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆర్ఆర్ఆర్ సెట్‌ను చూసేందుకు వెళ్లాడు.

ఆ స‌మ‌యంలో రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు స్టోరికి సంబంధించి ప‌లు విష‌యాలు మాట్లాడుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌లతో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తీస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం ఉంది. అది అయిపోయిన త‌ర్వాత పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబోలో సినిమా రానున్న‌ట్లు తెలుస్తోంది.

పెట్రోల్ లీట‌ర్ కు ఒక్క రూపాయేన‌ట‌!

సిల్వ‌ర్ శారీలో త‌ళుక్కుమ‌న్న కైరా అద్వాని

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -