Saturday, April 20, 2024
- Advertisement -

పూజ హెగ్డేకు ఫిదా అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..?

- Advertisement -

పీరియాడికల్‌ లవ్‌స్టోరితో రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న నేచురల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”.ఈ మూవీలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుంటే, ఈ సినిమాలో పూజా హెగ్డే మెడికో పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ “రాధేశ్యామ్” మూవీ పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. “రాధేశ్యామ్‌” మూవీలో ఒక పాట మినహా ఈ చిత్రం మొత్తం పూర్తయిందని సమాచారం.ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. “రాధే శ్యామ్” సినిమాలో కథ మొత్తం పూజా హెగ్డే చుట్టే తిరుగుతుందట.

Also read:తన ఫోటోకి పాలాభిషేకం పై స్పందించిన సోను సూద్.. ఏమన్నారంటే?

తాజాగా ప్రభాస్‌తోపాటు సినిమా యూనిట్‌లోని కొందరు ప్రముఖులు కలిసి రాధేశ్యామ్ సినిమాను వీక్షించారు. అయితే సినిమా చూసిన తర్వాత పూజా హెగ్డే నటనకు ప్రభాస్ ఫిదా అయ్యారు.ఈ సినిమాలో పూజా హెగ్డే ఎంతో అద్భుతంగా నటించిందని ప్రభాస్ ప్రశంసలు వర్షం కురిపించాడు. అలాగే ఈ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉండే రొమాంటిక్ సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని.ప్రభాస్‌తో పూజా హెగ్డే కెమిస్ట్రీ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించారు.ప్రభాస్ “సాహో”మూవీ విడుదలైన దాదాపు రెండేళ్ల తర్వాత రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ పై మరింత ఆసక్తి నెలకొంది.

Also read:పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -