బాహుబలి కి సంబంధించి రోజుకో వార్త చక్కర్లుకొడుతోంది. అందులో ఏది నిజమో, ఏది అభూత కల్పనో తెలీదు గానీ… ప్రతీ వార్తా అటు బాహుబలి అభిమానుల్నీ, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్నీ సంతోష పెడుతోంది. ఇప్పుడు బాహుబలి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. బాహుబలిలో ఇద్దరు ప్రభాస్ లు ఉన్న సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ద్విపాత్రాభినయం చేశాడు.
ఇప్పుడు బాహుబలి 2లో మూడో పాత్ర కూడా ఉందట. ధర్మేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఈసినిమాలో మరో పాత్రలో కనిపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. అమరేంద్ర బాహుబలి తండ్రి గా ధర్మేంద్ర బాహుబలి పాత్ర తెరపైకి వస్తుందని, ఈ పాత్రే బాహుబలి 2 లో కీలకం కానున్నదని తెలుస్తోంది. అంతేకాదు.. బాహుబలి 1ని `కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు` అనే ప్రశ్నతో ముగించాడు రాజమౌళి. అలాంటి ఓ ట్విస్టే.. `బాహుబలి 2` క్లైమాక్స్లోనూ ఉంటుందట.
అప్పుడే ధర్మేంద్ర బాహుబలిని చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పార్ట్ 2లోనూ భారీ మలుపులే ఉండబోతున్నాయన్న విషయం స్పష్టమైంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోత్నారని అనుకున్నారు.. కానీ తాజాగా అసలు నిజం బయటపడింది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడు, బాహుబలి తప్ప మరో పాత్రలో కనిపించడట. బాహుబలి లో ప్రభాస్ మూడో పాత్ర చేస్తున్నాడు అన్నది మొత్తం రూమర్ అని తెలుస్తోంది. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లోనే కనిపిస్తారని మూడో పాత్ర లేదని తెల్చేసింది.
Related