మైనర్ బాలికలే వారి టార్గెట్. అందమైన మైనర్ బాలికలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్టు వారి కంటపడిందా…వారి పంట పండినట్టే. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మైనర్ బాలికలను టార్గెట్గా చేసుకుని వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఓ హైటెక్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ హైటెక్ వ్యభిచార ముఠా ఇబ్బందుల్లో ఉన్న మైనర్ బాలికలకు వలవేసి వారి ఆర్థిక అవసరాలు తీరుస్తున్నట్టు నమ్మించి వారిని ఈ రొంపిలోకి దింపుతోంది.
హౌసింగ్ బోర్డు కాలనీలో జరిపిన దాడుల్లో వ్యభిచార నిర్వాహకులు తురాయి రవి, తురాయి లక్ష్మి, కొత్త శ్రీనివాస బాల మాణిక్యాలరావు, పి అండ్ టి కాలనీకి చెందిన ని ర్వాహకులు పుట్టా దేవితో పాటు విటులు మోర్ల వెంకట పెద్దిరాజు, సికిలే సతీష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. హౌసింగ్ బోర్డులో క్యాటరింగ్ పేరుతో ఒక కారులో విటులను తీసుకురావడం, తీసుకువెళ్ళడం జరుగుతోంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిపై కన్నేసి లోబర్చుకుని వ్యభిచార గృ హాలకు తరలిస్తున్నారన్నారు. అమాయకులైన బాలికలు వారి వలలో పడి మోసపోతున్నారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతులతో పాటు విశాఖ జిల్లా అరకు నుంచి కూడా బాలికలను రప్పిస్తున్నారు.
Related