Wednesday, May 22, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ కక్క్రుత్తి వల్లనే ప్లాప్ వచ్చిందా ?

- Advertisement -

మొదటి మూడు సినిమాలూ హ్యాట్రిక్ కొట్టి సరికోత్త రికర్ద్ సృష్టించాడు హీరో రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా సినిమాతో అనుకోకుండా హీరో అయిపోయిన ఈ కుర్రాడు నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్ అవడం కోసం ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు.

తాను ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసినా డైరెక్షన్ వైపునే తన మైండ్ అంతా ఉండడం తో ఎప్పుడూ హీరో చాన్స్ ల కోసం కూడా చూసింది లేదు అతను కానీ ఒక్కసారిగా అనుకోకుండా ఉయ్యాలా జంపాలా దెబ్బకి సూపర్ హీరో అయిన రాజ్ తరుణ్ తరవాత సినిమా ‘ సినిమా చూపిస్తా మావా ‘ తో ఇంకొక సూపర్ హిట్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు. డిఫరెంట్ సబ్జెక్ట్  ఎంచుకుని మరీ కుమారీ 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు తరుణ్.

అయితే ఇతని కొత్త చిత్రం సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలూ నిన్న ప్రేక్షకుల ముందరకి వచ్చింది కానీ ఈ చిత్రానికి ఇదివరకు లాగా పాజిటివ్ టాక్ ఎక్కడ కనపడ్డం లేదు. క్రిటిక్ లు ‘బోరింగ్’ సినిమా అంటూ బోర్డు తగిలించేసారు కూడా. ఈ నేపధ్యం లో రాజ్ తరుణ్ భవిష్యత్తు సంగతి పక్కన పెడితే నాల్గవ సినిమా తప్పటడుగు ఎక్కడ వేశాడా అనేది పెద్ద ప్రశ్నగా మారంది. అయితే మూడు వరుస హిట్స్ కారణంగా తొలి రోజు కలెక్షన్స్ మాత్రం ఈ మూవీకి బాగానే వచ్చాయి. మొదటి రోజునే మూవీ హిట్టా – ఫ్లాపా అని డిసైడ్ చేయడం కష్టమే అయనా కంటెంట్ చూసి చెప్పేయచ్చు అంటున్నారు విశ్లేషకులు. సినిమా చూపిస్తా మావా తరవాత కుమారీ కీ ఈ సినిమాకి ఒకే సారి సంతకం పెట్టేసాడు మనోడు అంటున్నారు. రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ ఉండడం తో కక్రుత్తి పడి ప్లాప్ తెచ్చుకున్నాడు అని భోగట్టా. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -