టాలీవుడ్ లో కింగ్ నాగర్జునకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే నాగర్జున తన ఇద్దరు అబ్బాయిలను కూడా టాలీవుడ్ లో మంచి హీరోలుగా నిలబెట్టేందుకు బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అక్కినేని నాగర్జున పెద్ద అబ్బాయి నాగచైతన్య మంచి సినిమాలు చేస్తూ దూసుకెళ్తుండగా… ఇక చిన్న అబ్బాయి అఖిల్ మాత్రం మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. చేసిన మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండో సినిమాతో మంచి విజయం సాధించాలని చూస్తున్నాడు.
అందుకే అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కూమర్ అఖిల్ రెండో సినిమాకి దర్శకుడిగా తీసుకున్నారు. ఇక నాగార్జున ఇద్దరు అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం.. నాగార్జున కూడా వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎప్పుడో జరిగిపోయాయి. వచ్చే యేడాది అక్కినేని నాగచైతన్య – అఖిల్ పెళ్లిళ్లు గ్రాండ్గా జరగనున్నాయి. నాగ చైతన్య క్రేజీ హీరోయిన్ సమంతతో ప్రేమలో ఉంటే… అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియ భూపాల్ తో ప్రేమలో ఉన్నాడు.
దింతో అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో అని తెలుసుకునే ప్రయత్నం చేసిన టాలీవుడ్ వర్గాలకు ఊహించని షాక్ తగిలింది. అఖిల్ ప్రేమించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఒక్క సారిగా కంగుతిన్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు జీవీకే అధినేత కృష్ణరెడ్డి ముద్దుల మనవరాలు. జీవీకే పేరు తెలియని వారు ఉండరు.. హైదరబాద్ కేంద్రంగా ప్రారంభం అయిన ఈ సంస్థ.. అనంత కాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. దేశంలో మొదటి వంద మంది ధనికుల జాబితాలో జీవీ కృష్ణ రెడ్డీ ఒకరు. ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంత పెద్ద వ్యాపార వేతకు అల్లుడు కాలేదని.. అఖిల్ పుణ్యమా అని నాగర్జున, జీవీకే కుటుంబం కలవడం వియ్యంకులుగా మారడం జరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో మంచి బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందిన నాగర్జున అఖిల్ పెళ్లి విషయంలో కూడా మరోసారి తన మార్కు ప్రదర్శించరంటూ టాలీవుడ్ లో గుస గుసలు మొదలు అయ్యాయి.
{youtube}DAaqOVRekrg{/youtube}
Related