Tuesday, April 23, 2024
- Advertisement -

రెండు గెటప్‌లలో రామ్‌చరణ్

- Advertisement -

టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా త్వరలో ఓ పాన్ ఇండియా మూవీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అడ్వాణీ కథనాయికగా సందడి చేయబోతోంది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్… సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ తేజ్ రెండు గెటప్పుల్లో కనిపించబోతున్నారట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా రామ్ చరణ్ కనిపిస్తూనే.. సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారని సమాచారం.

దీపికా సినిమాపై కంగనా ఫైర్

బాలీవుడ్‌ను టాలీవుడ్ కైవసం చేసుకుంటుంది

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -