Saturday, April 20, 2024
- Advertisement -

బాలీవుడ్‌ను టాలీవుడ్ కైవసం చేసుకుంటుంది

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై నటి పాయల్ ఘోష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఎన్టీఆర్ – తమన్నా జంటగా నటించిన ‘ఊసరవెల్లి’ మూవీలో కీలక పాత్ర పోషించింది పాయల్ ఘోష్. అంతే కాదు బాలీవుడ్‌పైనా ఘాటు కామెంట్స్ చేసింది. వాస్తవానికి బాహుబలి చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి మరో స్థాయికి చేరింది. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై చిన్న చూపుగా వ్యవహరించే బాలీవుడ్ నటీనటులు ఇప్పుడు తెలుగు హీరోలు, దర్శకులతో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొనె.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తన మనసులో మాటను చెప్పడం అంతటా ఆసక్తికరంగా మారింది. దీనిపై పాయల్‌ ఘోష్‌ స్పందించింది. ఇప్పుడామె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తాను నటించబోతున్నట్లు బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవలే స్వయంగా వెల్లడించింది.

ఎన్టీఆర్ పై పాయల్ ఘోష్ .. ఒకపక్క ప్రశంసలు కురిపిస్తూనే బాలీవుడ్‌పై విరుచుకుపడింది. ‘‘బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ తారక్‌తో కలిసి వర్క్‌ చేసేందుకు ఇప్పుడు వరుస కడుతున్నారు. ‘ఊసరవెల్లి’ కోసం నేను ఇప్పటికే ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్‌లో మా సినిమా ఎలాంటి ఖ్యాతి సొంతం చేసుకుంటుందో 2020లో ట్వీట్‌ చేశా. దానికి పలువురు నన్ను విమర్శించారు. కానీ ఇప్పుడు మరోసారి చెబుతున్నా దక్షిణాది చిత్రపరిశ్రమ త్వరలోనే బాలీవుడ్‌ని కైవసం చేసుకుంటుంది. తన మాటలు నిజమౌతాయని పాయల్ ట్వీట్ చేసింది.

Also Read: మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -