Saturday, April 27, 2024
- Advertisement -

దీపికా సినిమాపై కంగనా ఫైర్

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజా సినిమాపై కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలపై తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగన.. తాజాగా దీపికా పదుకొనె చిత్రం గెహ్రాహియాను టార్గెట్ చేసింది. షకున్ బత్రా దర్శకత్వం వహించిన గెహ్రాహియా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతోంది.

కొత్తతరం, అర్బన్ సినిమా పేరుతో దయ చేసి చెత్త అమ్మకండంటూ కంగనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్తతరం ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దీపిక-సిద్ధాంత్‌ చతుర్వేదిల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు కాస్త మితిమీరాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. 1965లో విడుదలైన ‘హిమాలయ్‌ కీ గాడ్‌ మే’లోని ఓ పాటను ట్యాగ్‌ చేస్తూ..‘‘నేను కూడా కొత్తతరానికి చెందిన మహిళనే కానీ, ఈ పాటలో చూపించిన రొమాన్సే.. నిజమైన రొమాన్స్‌గా భావిస్తున్నా.

అంతేకానీ కొత్తతరం, అర్బన్‌ సినిమా పేరుతో దయచేసి చెత్త అమ్మకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలే. స్కిన్‌ షో చేసినంత మాత్రాన అవి మంచివి కాలేవు. అందరికీ తెలిసిన ప్రాథమిక సత్యమిది. ‘గెహ్రాహియా’ వాళ్లకు తెలియలేదా?’’ అని కంగనా రాసుకొచ్చింది.

సినీ పరిశ్రమపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఎమోషన్ పోస్టు పెట్టిన ప్రభాస్

బాలీవుడ్‌ను టాలీవుడ్ కైవసం చేసుకుంటుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -