బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పాత్ర తర్వాతల తర్వాత రమ్యకృష్ణ నటించిన శివగామి బాగా పేలింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు బిలియన్ రూపాయల సినిమా వ్యయంతో తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన అందరికి భారీ రెమ్యునరేషన్ లు అందించారు. హీరో ప్రభాస్, మరో హీరో రానాలతోపాటు.. హీరోయిన్లు అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరికీ బాగానే ఇచ్చారనే ప్రచారం ఉంది.
ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ కు ఇచ్చిన రెమ్య్నరేషన్ జస్ట్ రూ.కోటి మాత్రమేనట. నిజానికి ఈ పాత్రకోసం తొలుత సీనియర్ నటి శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి ఎంపిక చేశారు. ఇందుకోసం రమ్యకృష్ణం దాదాపు గా 5 కోట్ల వరకు డిమాండ్ చేసిందని.. అందుకు ఆయన సరేనన్నారు కూడా.. లాస్ట్ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ చేరిపోయింది.
అయితే రమ్యకృష్ణ ఈ సినిమాకుగాను రూ.కోటి మాత్రమే పారితోషికం ఇచ్చారట. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రమ్య పాత్రకు గాను కోటి రూపాయలు ఇవ్వడం తక్కువేనని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్తో తీసిన ఈ చిత్రానికి రమ్యకృష్ణ పాత్ర అత్యంత కీలకం. అలాంటి పాత్రకు కేవలం రూ.కోటి ఇవ్వడం ఏమంటని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం రాజమౌళి తీరు అసలు బాలేదని.. అంటున్నారు.
{youtube}YeF580BWbLk{/youtube}
Related