సుచీలీక్స్ రచ్చ ఏ రెంజ్ లో జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రచ్చ మొదలు కాగానే.. సినీ పరిశ్రమలో జరుగుతున్న చీకటి కోణాలు పై ఒక్కొక్కరుగా తమ గళం విప్పుతున్నారు. ఇప్పటి వరకు మాట్లాడని హీరోయిన్స్ కుడా వరుసబెట్టి నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఒప్పుకుంటున్నారు. తమకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు.
అయితే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే సదరు దర్శకులు, నిర్మాతల పేర్లను బయట పెట్టే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు. తాజాగా శివగామి రమ్యకృష్ణ మరో సారి ఈ నీచ సంస్కృతి మీద నోరువిప్పింది. సినీ పరిశ్రమలో అడ్జెస్ట్మెంట్ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపులు గురించి నటి రెజీనా, ఒక ఛానల్ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య.. తాప్సీ పన్ను లాంటి హీరోయిన్ మాత్రమే కదు, రాధికా ఆప్టే, సుకన్య లాంటి తారలూ చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇలా ఇటీవల పలువురు హీరోయిన్స్ ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిర్మాతల, దర్శకుల రూమ్లకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్కు ఫుల్స్టాప్ పడిపోతుందని కూడా చెప్పారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలపై సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మొదటి సారిగా స్పందించడం ఇండస్ట్రీలో రచ్చ లేపింది. ఈ వ్యవహారంపై తన స్పందనను బోల్డ్గా చెప్పిన రమ్యకృష్ణ ఇతర రంగాల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలోనూ అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అని చెప్పింది. అంతేకాకుండా అలా అడ్జస్ట్ అయిన హీరోయిన్లే కెరీర్లో ముందుకు వెళతారని చెప్పి పెద్ద దుమారానికే తెరలేపింది. ఇకపోతే అడ్జస్ట్ అవడం, కాకపోవడం అనేదివారి వారి వ్యక్తిగత నిర్ణయాలను బట్టి ఉంటుందని, అయితే అలా అడ్జస్ట్ అయిన వారు మాత్రమే ముందుకు వెళతారని చెప్పింది. ఇదండీ సంగతి.. వెండితెర పై తమ అందాలతో కుర్రకారును మత్తెక్కించే ముందు.. ఎవరెవరితో ఎన్ని రకాలుగా అడ్జస్ట్ అవుతున్నారో వారికే తెలియాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related