Saturday, April 20, 2024
- Advertisement -

ఖిలాడీ సినిమా ఓటీటీలో వస్తుందా?

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా “క్రాక్ ” తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘ఖిలాడి’ ఈ సినిమాకు రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించిది. అయితేప్రస్తుతం నెలకొన్న కోవిడ్‌ పరిస్థితుల కారణంగా
థియేటర్లు మూతపడడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయన సరసన మీనాక్షి చౌదరి,డింపుల్ హయతి హీరోయిన్లుగా అలరించనున్నారు.యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు.హాట్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్ర నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్,టీజర్‌కి మంచి స్పందన లభించడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

తాజాగా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మరి థియేటర్ రిలీజ్ తరువాత ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? లేదంటే నేరుగా ఓటీటీలోనే వస్తుందా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

Also read:దేశంలో నువ్వే సంపన్నురాలివి తల్లి అంటున్న సోనూసూద్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -