Saturday, April 27, 2024
- Advertisement -

కాంబో ఈజ్ బ్యాక్..హరీష్‌తో రవితేజ

- Advertisement -

ఓ వైపు ఫ్లాప్‌లు పలకరిస్తున్న మరోవైపు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు రవితేజ. రీసెంట్‌గా టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతో వచ్చినా అది పెద్దగా ఆకట్టుకులేకపోయింది. రవితేజ నటనకు మంచి మార్కులే పడ్డా వసూళ్ల పరంగా మాత్రం ఢీలా పడింది.

అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు రవితేజ. తాజాగా బ్లాక్ బాస్టర్ దర్శకుడు హరీష్ శంకర్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మాస్ మహారాజా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుంది. గతంలో పీపుల్స్ మీడియా బ్యానర్‌లో రవితేజ హీరోగా వచ్చిన ధమాకా, మిరపకాయ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి. తాజాగా ఇదే బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది అని మేకర్స్ చెప్పగా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -