Wednesday, April 24, 2024
- Advertisement -

చిరు, మోహన్ బాబుల ముద్దుపై శ్రీరెడ్డి కామెంట్స్..!

- Advertisement -

ఇటివలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అంశాలను నటుడు రాజశేఖర్ బయటపెట్టడం, దాంతో చిరంజీవి ఆయనపై ఫైర్ అవడం వంటివి జరిగాయి. దీనిపై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. క్రమశిక్షణా కమిటీ పెట్టాలని చిరంజీవి పిలుపునిచ్చారు కానీ ముందుగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సింది చిరంజీవిపైనేనని శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ పంక్షన్ జరిగిన నాగార్జున, మోహన్ బాబు, చిరంజీవి, మురళీ మోహణ్, సుబ్బరామి రెడ్డి వీళ్లే కనిపిస్తారు.

చిన్న ఆర్టిస్టులను వీళ్లు అసలు పొత్సహించరు. నేను ‘మా’పై పెట్టిన శాపనార్థాలు ఈరోజు ఫలించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజానికి ’మా’ ఆర్టిస్ట్‌లకు ఏదన్నా మంచి చేయాలన్న ఉద్దేశంలో రాజశేఖర్ ఉంటారని.. ఈ విషయంలో నా సపోర్ట్ ఆయనకే అని.. జీవితకు మాత్రం అస్సలు సపోర్ట్ చేయను. మైకు ఉంది కదాని నోటికొచ్చినట్లు వాగేస్తుంటారు. ఆవిడ గురించి నేను మాట్లాడను అని శ్రీరెడ్డీ చెప్పింది. ఇక ‘బిగ్ బాస్’ షోలో తనకు ఆఫర్ రాకుండా చేసింది నాగార్జున, చిరంజీవినేనని శ్రీరెడ్డి అన్నారు.

చిరంజీవి మాట్లాడితే పెద్దరికం అంటారు. పెద్దరికం అంటే ఏంటి జయప్రద, ఖుష్బూలతోనూ ఈ వయసులోనూ కుప్పి గంతులు వేయడమా? ఆడోళ్ల సమస్యల గురించి బయటికి వచ్చి మాట్లాడటానికి అసలు మీకు టైమే ఉండదు. మీకు ఎప్పుడూ పార్టీలు, డ్యాన్స్‌లు తప్ప మరో ఆలోచన ఉండదు. మాలాంటి చిన్న పిల్లలు మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తారు, లేదా చంపేస్తారు అని చిరుపై ఫైర్ అయింది.

ఇక చిరు, మోహన్ బాబు ముద్దుల వెనకాల రహస్యాలు ఏంటంటే.. మేమందరం కలిసే ఉన్నాం, మేం కట్టిన ఈ గోడను ఎవ్వరూ తాకలేరు అని చెప్పుకోవడానికి అందరి ముందు అలా ముద్దులు పెట్టేసుకుంటున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -