Friday, March 29, 2024
- Advertisement -

ట్రైన్ లో బాత్రూం వద్ద పట్టుకున్నారంటూ గుట్టు విప్పిన సీనియర్ నటి రజిత!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రజిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కమెడియన్ గా పలు పాత్రల్లో నటిస్తున్నప్పటికీ ఒకప్పుడు హీరో అక్క, చెల్లెలు పాత్రలలో లేదా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నటి రజితతో పాటు హేమ, సురేఖవాణిలు కూడా మంచి స్నేహితులు. వీరందరూ కలిసి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటి రజిత తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రజిత త తోపాటు సురేఖవాణి పాల్గొని వారి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే రజిత తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గురించి కూడా తెలిపారు.

Also read:ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

ఈ సందర్భంగానే అలీ రజితని ఉద్దేశించి మీకు ట్రైన్ జర్నీ అంటే భయం అని విన్నాను? ఎందుకు అంత భయం అని అని అడగగా ..అందుకు రజిత ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను. బాత్ రూమ్ బయట ఒక వ్యక్తి కౌగిలించుకొని ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో గట్టిగా కేకలు వేసిన ఎవరికీ వినిపించలేదు. ఇక అప్పటి నుంచి రైలు ప్రయాణం చేయలేదని అసలు విషయం బయట పెట్టారు.

Also read:అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

ఈ క్రమంలోనే ఆలీ రజిత పెళ్లి గురించి సెటైర్లు వేశారు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పెళ్లిచూపులు జరిగాయటగా? అయితే ఆయన ఎవరో చూశారా అంటూ అతని ఫోటోను చూపించే క్రమంలోనే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించారు. ఈ విధంగా వీరందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఎంతో సందడి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -