Monday, April 29, 2024
- Advertisement -

భారీ విరాళం ప్రకటించిన రజిని కాంత్ ముద్దుల కూతురు!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడటం కోసం ఎంతోమంది తమ వంతు సహాయంగా విరాళాలను ప్రకటిస్తూ వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం కరోనా మహమ్మారి అరికట్టడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి తమ వంతు సాయం చేయటానికి సినీ సెలబ్రిటీలు ముందుకు కదిలారు.

ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు తమిళనాడు ప్రభుత్వానికి తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించగా ఇప్పుడు ఆ జాబితాలోకి సినీ నటుడు అజిత్, రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ చేరారు. నటుడు అజిత్ రూ.25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు.

Also read:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?

శుక్రవారం ఉదయం రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు.తన భర్త విశాగన్‌ తరఫున రూ.కోటిని ఆర్థికసాయంగా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే నటుడు సూర్య అతని సోదరుడు కార్తి కోటి రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించగా దర్శకుడు మురుగదాస్ 25 లక్షల రూపాయలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -