శాలినీ పాండే… ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమాలో మాయచేసింది. అమాయక చూపులు, ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమాలో విజయ్తో శాలినీ కెమిస్ట్రీ అదుర్స్. తొలి సినిమానే అయినా లిప్ లాక్ సీన్స్తో రచ్చచేసింది.ఈ సినిమా తర్వాత టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకుంది.
ఓ వైపు సినిమాలు మరోవైపు గ్లామర్ షోతో రచ్చచేస్తోంది శాలినీ. జీరో ప్యాక్తో అదిరే ఫోటోషూట్లతో యూత్ గుండెల్లో హీట్ పెంచేస్తోంది. తాజాగా బ్లూ పాయింట్,షర్ట్లో కనిపించి,కనిపించకుండా ఉన్న యద అందాలతో రచ్చ చేసింది. ఈ ఫోటోషూట్ ని చూసి అమ్మడు ఇంతలా ఓవర్ డోస్ పెంచేసిందేంటా అని ఆశ్చర్యపోతున్నారు. శాలిని లుక్ మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్ అనేలా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చాలా రోజుల తరువాత అందంగా,మరింత నాజూగ్గా ఉన్న శాలినీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తెలుగులో నిశ్శబ్దం ,ఎన్టీఆర్ కథానాయకుడు,సావిత్రి బయోపిక్ మహానటిలో నటించి మెప్పించగా ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె ‘మహారాజా’ విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకుంది శాలినీ.