తెలుగు బుల్లి తెరపై జబర్ధస్త్ ప్రోగ్రాం ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ కామెడీ షో ద్వారా చాలా మందికి మంచి జీవితం దక్కింది. అప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేని నటులు ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ తో ఎంతో మంది సినిమాల్లో బిజీ గా మారిపోయారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే..టాలీవుడ్ లోనే వీరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు..వారే అనసూయ, రేష్మి.
ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెంజ్ లో హిట్ అయిన ఈ షోలో ఇటివలే వస్తున్న స్కిట్లలో మంచి కంటెంట్ మిస్సై అయ్యి.. బూతు కంటెంట్తో స్కిట్ ఎక్కువైపోయిందని విమర్శలు వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు కామెడీ ఎక్కువైందని సినీ విశ్లేషకులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ఈ షోలో పాల్గొనే నటులపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు తాజాగా జబర్ధస్త్ కు సంబంధించి ఓ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
తాజాగా లేడీస్ పాత్రలకు కనిపిస్తున్న జబర్ధస్త్ కమెడియన్.. వినోద్ కిడ్నాప్ అయ్యాడని కాసేపు… లేదు లేదు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఇంకాసేపు.. ఇలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రెండు విషయాల్లో ఎలాంటి వాస్తవం లేదు కానీ.. వినోద్ కి బలవంతంగా అయినా వివాహం జరపాలని భావించారు. ఈ నెపథ్యంలో జరిగిన పెనుగులాటలో వినోద్ చేతికి గాయమైంది. దీంతో వినోద్ సూసైడ్ చేసుకున్నారని పుకార్లు చెలరేగాయి. ఇక కుటుంబ సభ్యులే అతనిని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా తెరపైకి వచ్చింది. సదరు సమాచారం కాస్త పోలీసులకు అందడంతో సంఘటనా స్థలికి చేరుకోగా… తననెవరూ కిడ్నాప్ చేయలేదని, అలాగే తాను కూడా ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని వినోద్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related