Friday, April 26, 2024
- Advertisement -

సాయి పల్లవికి పొగరు.. నిర్మాత కూడా సీరియస్..?

- Advertisement -

నేచురల్ బ్యూటీ,తమిళ ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “లవ్ స్టోరీ” మూవీ కరోనా కారణంగా విడుదల కాలేదన్న విషయం మనందరికీ తెలిసిందే.సాయి పల్లవి హీరోయిన్ గా “ఫిదా” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై
వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తనకు నచ్చిన పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

సాయి పల్లవి బ్లాక్ బస్టర్ మూవీస్ అయినా ఫిదా, ఏంసిఏ సినిమాల షూటింగ్ సమయంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీనివాస కల్యాణం సినిమాకు సాయి పల్లవిని సంప్రదించగా డేట్స్ లేకపోవడం వల్ల నో చెప్పిందట. దీంతో హిట్ సినిమాలు పడ్డాయి అన్న పొగరుతో నో చెప్పిందా అంటూ అప్పట్లో సాయి పల్లవిపై కొన్ని గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయి. వీటిపైన ఎప్పుడు సాయి పల్లవి స్పందించలేదు.ఆ గాసిప్స్ నిజం అయిన కాకపోయినా ఆతర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మాణంలో సాయి పల్లవి నటించలేదని చెప్పాలి.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

ఇక రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాచురల్ స్టార్ నాని జంటగా “శ్యామ్ సింగరాయ్‌” మూవీలో కూడా నటిస్తోంది.

Also read:నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -