Sunday, April 28, 2024
- Advertisement -

బాలయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శృతి హాసన్?

- Advertisement -

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ”సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో బాలయ్య త్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇదివరకే బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే ఇప్పటికే అఖండ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

బాలకృష్ణ బోయపాటి సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన బలుపు, క్రాక్ సినిమాలలో నటించి మంచి ఈ విషయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ బాలయ్యతో తీసే సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం శృతిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also read:గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం శృతిహాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ ప్రభాస్ సలార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు పూర్తి కాగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలేక్కనుందని తెలుస్తుంది.

Also read:సీరియల్ ‘హీరోయిన్’గా నటించి సినిమా అవకాశం దక్కించుకుంది.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -