Thursday, May 16, 2024
- Advertisement -

ఆడియో వేడుకల్లో సింగర్ల పరువు తీస్తున్న సింగర్స్

- Advertisement -

ఆడియో వేడుకలో సింగర్లతో పాటలు పాడించడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ ఆడియో వేడుకలో వారి పరువు పోతుంది. అయితే ఈ గాయనీ గాయకులూ పాడిన పాటలే కాక ఇతర గాయనీ గాయకులు పాడిన పాటలు కూడా పాడుతుంటారు. దానికోసం ఎంతో కష్టపడి రిహార్సల్స్ కూడా చేస్తుంటారు. అయితే ఈ మధ్య జరుగుతున్న ఆడియో పంక్షన్లో సింగర్ లపై లేనిపోని అనుమానాలు కలుగజేస్తున్నాయి. తాజాగా జరిగిన జనతా గ్యారేజ్ ఆడియో వేడుక దీనికి ఉదాహరణ.

ఈ ఆడియో వేడుకల్ నేహా బాసిన్‌, శ్రావణ భార్గవి లైవ్‌లో పాటలు పాడి వినిపించారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది.. వారు పాడడం లేదని, బ్యాగ్రౌడ్‌లో వస్తున్న పాటకు కేవలం పెదవులు కదిపి యాక్ట్‌ చేస్తున్నారని. ‘ఉసరవెల్లి’ సినిమాలో ‘నిహారిక.. నిహారిక’ అంటూ సాగే పాట పాడిన నేహా బాసిన్‌ ఈ సినిమాలోనూ ఓ పాట పాడింది. ఆ పాటనే వేదిక మీద కూడా పాడింది. అయితే ఆమె లిరిక్స్‌కు తగినట్టుగా సరిగా లిప్‌ సింక్‌ చేయలేకపోయింది.

మరో విశేషమేమిటంటే పాట పూర్తయ్యాక మాట్లాడదామంటే మైక్‌ పనిచేయలేదు. నిజానికి పనిచేయని మైక్‌తోనే మొదట్నుంచీ నటించింది. ఇక మరో సింగర్  శ్రావణ భార్గవి కూడా పాట పాడింది. దేవీ శ్రీ తమ్ముడు సాగర్‌తో వేదిక ఎక్కి ‘పక్కా లోకల్‌’ పాట పాడింది భార్గవి. అయితే పాట మొదలైన అర నిముషం తర్వాత ఓ విషయం బయటపడింది. వేదిక మీద శ్రావణ భార్గవి పాట పాడుతోంటే.. మనకు వినిపించింది గీతా మాధురి గొంతు. అంటే గీత పాడిన పాటకు భార్గవి పాడినట్లు నటించింది. ఈ విధంగా జనాలను మాయ చేస్తున్నారు.

Related

  1. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  2. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?
  3. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!
  4. ‘జనతా గ్యారేజ్‘ డైలాగ్స్ లీక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -