Monday, May 6, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఏ రెంజ్ లో పాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. డ్యాన్స్, ఫైట్స్ లో తనదైన స్టైల్ చూపించి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక తెలుగులోనే కాకుండా తమిళ, మళియాల ఇండస్ట్రీలో కూడా బన్నీ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి స్టార్ కి ఇప్పుడు ఘోరంగా అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే..రిసెంట్ గా సైమా అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ సైమా అవార్డ్స్ వేడుకకి సౌత్ ఇండియా మూవీ స్టార్స్ తో పాటు టాలీవుడ్ నుండి చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, నయనతార, సమంత మరియు మరికొంత మంది ప్రముఖులు హాజరు అయ్యారు. 

ఇక బన్నీకి రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రకు గాను అవార్డు రాగా.. నయనతారకు తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నానుమ్ రౌడీ’ సినిమాకు బెస్ట్ హీరొయిన్ అవార్డు వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ నయన తారకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచారు.  కానీ మనోడికి ఇక్కడే ఘోరంగా అవమానం జరిగింది.. తెలుగులో ఎంతో పేరు తెచ్చున్న బన్నీ ని స్టేజ్ పైకి పిలిచిన తర్వాత అతన్ని కాదని నయన తార ఈ మూవీ డైరెక్టర్ విగేష్ శివన్ నన్ను ఈ చిత్రంలో నీకంటే కూడా ఎవ్వరు బాగా చేయలేరు అని ప్రోత్సహించి నాతో ఈ సినిమాలో నటించేలా చేశారు.

ఈ అవార్డుని నేను విగేష్ శివన్ చేతుల మీదగా తీసుకుందాం అని అనుకుంటున్నాను అని స్టేజి మీద అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ పరువు తీసేసింది. దీనికి కారణం శివన్, నయన కొంత కాలంగా ప్రేమలో మునిగిపోయారు. నయన్ చేసిన పనికి బన్నీ ఫ్యాన్స్ విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత మాత్రానికి ఓ హీరోని అంత మంది ముందు స్టేజి పైకి పిలవడం దేనికి ఇలా అవమానించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

Related

  1. తమ్ముడు కోసం బన్నీ ఏం చేస్తున్నాడంటే?
  2. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?
  3. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  4. జైల్లో నయనతార , అసలు ఏమైంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -