సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28 వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటన వెలువడిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలోనే కరోనా కారణంగా వాయిదా పడింది. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న “అయ్యప్పనుమ్ కోశియమ్” సినిమాకు రీమేక్కు డైలాగ్స్ మరియు స్క్రీన్ప్లే అందిస్తున్నారు. అయితే కరోనా కారణం సినిమా వాయిదా పడింది.
Also read:భారత్ ప్రైమ్ మినిస్టర్ సోనూసూద్.. సోను సూద్ రియాక్షన్…!
ఈ రెండు సినిమాలు పూర్తికాగానే మహేష్, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్ని త్వరలోనే ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.అయితే కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరి దీనిపై క్లారిటీ రావాలంటూ ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also read:తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?